Friday, April 26, 2024

ఎల్‌ఒసి వెంట పరిస్థితిని సమీక్షించిన ఆర్మీచీఫ్ నరవణె

- Advertisement -
- Advertisement -

Army chief visits forward areas along LoC in Jammu

జమ్ము: జమ్మూలోని ఆధీనరేఖ(ఎల్‌ఒసి)ప్రాంతంలో ఆర్మీచీఫ్ ఎంఎం నరవణె మంగళవారం పర్యటించారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఆ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్స్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారని ఆర్మీ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారని వారు తెలిపారు. వైట్‌నైట్ కార్ప్‌లోని ఎల్‌ఒసి ప్రాంతంలో పర్యటించిన నరవణె అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిపై మదింపు జరిపారు. జమ్మూకాశ్మీర్‌లో మైనార్టీలైన హిందువులపై ఇటీవల దాడులు పెరిగిన నేపథ్యంలో నరవణె పర్యటించడం గమనార్హం. ఉగ్రదాడుల్లో ఈ నెలలో ఇప్పటివరకు 13మంది పౌరులు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News