Saturday, April 27, 2024

బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest of Young man harassing Girl

 

మనతెలంగాణ, హైదరాబాద్ : బాలికకు అసభ్య మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా, ఉప్పల్, ఐజా మండలం, ఎస్‌సి కాలనీకి చెందిన బైరిపోగుల మోసయ్య కూలీ పనిచేస్తున్నాడు. అదే కాలనీలో ఉంటున్న బాలికకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు, అసభ్య ఫొటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు ఒకసారి యువకుడితో మాట్లాడింది.

అప్పటి నుంచి బాలికను కలుసుకునేందుకు యత్నించాడు. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత బాలిక తండ్రి మొబైల్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటోందని తెలిసింది. ఆమె కజిన్ ద్వారా మొబైల్ నంబర్ తెలుసుకుని అసభ్య మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తున్నాడు. రానురాను వేధింపులు ఎక్కువ కావడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ కెవి విజయ్‌కుమార్ దర్యాప్తు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News