Monday, April 29, 2024

ఏడోసారి ఇడి విచారణకు కేజ్రీవాల్ డుమ్మా..

- Advertisement -
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇడి విచారణకు డుమ్మా కొట్టారు. ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు ఇటీవల ఇడి ఏడోసారి నోటీసులు పంపింది. అయితే, కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడంలేదని ఆప్ పార్టీ స్పష్టం చేసింది. ఇడి అంశం కోర్టు పరిధిలో ఉందని… రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉందని ఆప్ నేతలు తెలిపారు. రాజకీయ కక్ష్యంతోనే కేంద్రం.. ఇడిని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతుందని.. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిందని ఆప్ నేతలు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News