Friday, April 26, 2024

కాబుల్‌లో జంట పేలుళ్లు: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -
50 మందికి పైగా గాయాలు

కాబుల్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సర్దార్ మొహమ్మద్ దావుద్ ఖాన్ సైనిక ఆసుపత్రి సమీపంలో మంగళవారం సంభవించిన రెండు బాంబు పేలుళ్లలో 19 మంది మరణించగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మీడియా కథనాలు తెలిపాయి. నగరంలోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో గతంలో దౌత్య కార్యాలయాలు ఉన్న ప్రాంతానికి సమీపంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించినట్లు తెలియచేసే ఫోటోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్రాంతంపై రెండు హెలికాప్టర్లు తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు ఒక వార్తాసంస్థకు తెలిపారు. సెంట్రల్ కాబుల్‌లోని 400 పడకల సైనిక ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు జరిగాయని, వెంటనే భద్రతా బలగాలను అక్కడకు పంపించామని ఆంతరంగిక మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్టీ తెలిపారు. పేలుళ్లతోపాటు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సాక్షులు తెలిపారు. పేలుళ్లకు కారణాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News