Tuesday, May 21, 2024

నాంపల్లి కోర్టులో న్యాయవాదిపై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on lawyer in Nampally court

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో శుక్రవారం నాడు న్యాయవాదిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయడంంతో కోర్టు ప్రాగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈక్రమంలో అప్రమత్తమైన న్యాయవాదులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇదిలావుండగా హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా నాంపల్లి కోర్టులో కూడా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

Attack on lawyer in Nampally court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News