Tuesday, May 14, 2024

స్మిత్ ఔట్…. ఆసీస్ 90/3

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆసీస్ జట్టు 39 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోయ్ బర్న్ నాలుగు పరుగులు చేసి ఉమేష్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. లాబాసింగ్ 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్టివెన్ స్మిత్ ఎనిమిది పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మాథ్యూ వాడే(40), ట్రావిస్ హెడ్(13) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ ప్రస్తుతం 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195

భారత్ తొలి ఇన్నింగ్స్: 326

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News