Saturday, May 4, 2024

అవినాష్‌రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పటిషన్ పై విచారణ రేపటికి వాయిదాపడింది. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి తదుపరి వాదనలు బుధవారం వాయిదా వేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సిబిఐ నిన్న నోటీసులు ఇచ్చింది. విచారణకు రేపు ఉదయం 10:30 గంటలకు రమ్మంటామని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామని సిబిఐ వెల్లడించింది. అటు నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది కోరారు. సాయంత్రం విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయవాది తెలిపారు. అవినాష్ రెడ్డిని విచారణ కోసం రేపు పిలుస్తామని సిబిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News