- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ తన వంతు సాయం చేశారు. తన ఎంపి ల్యాడ్స్ నుంచి కోటి రూపాయలు, నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. ఇప్పటికే కరీంనగర్ లోక్సభ పరిధిలో కరోనా కట్టడికి రూ.50 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. తన పిలుపు మేరకు రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలంతా పిఎం కేర్స్కు విరాళాలు అందించినట్లు బండి సంజయ్ వివరించారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
Bandi sanjay huge Donation to PM cares
- Advertisement -