- Advertisement -
ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. హ్యాట్రిక్ విజయంతో జోరుమీదున్న బెంగళూరు ఈ సీజన్లో తొలిసారి వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడబోతోంది. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరు తలపడనుంది. రాజస్థాన్పై టాస్ గెలిచిన బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పటిదార్ స్థానంలో కైల్ రిచర్డ్సన్ను తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు జయదేవ్ ఉనద్కత్ స్థానంలో శ్రేయస్ గోపాల్ను ఎంపికచేసినట్లు శాంసన్ వెల్లడించాడు.
- Advertisement -