- Advertisement -
ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్ లో ఓపెనర్ బట్లర్ (8) బౌల్డయ్యాడు. దీంతో రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వోహ్రా(7) జెమిసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ సిరాజ్ వేసిన 4వ ఓవర్లో ఎల్బి గా వెనుతిరిగాడు. దీంతో రాజస్థాన్ 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజుశాంసన్ (13), శివమ్ దూబే(4) పరుగులతో ఉన్నారు.
- Advertisement -