Monday, May 6, 2024

బంగ్లా చేతిలో కివీస్ చిత్తు

- Advertisement -
- Advertisement -

ఢాకా: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 16.5 ఓవర్లలో కేవలం 60 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లు సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ముస్తఫిజుర్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. సైఫుద్దీన్, షకిబ్, నసూమ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఇక కివీస్ జట్టులో కెప్టెన్ లాథమ్ (18), హెన్రీ నికోల్స్ (18) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షకిబ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముష్ఫికుర్ రహీ16 (నాటౌట్), మహ్మదుల్లా 14(నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.

Bangladesh won by 7 wickets against Kiwis

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News