- Advertisement -
మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఉప్పల్, సౌత్ స్వరూప్నగర్కు చెందిన బాలసుందరం(38) ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కింగ్ కోఠిలోని ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నోట్లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Bank Manager commits Suicide by Hanging
- Advertisement -