Monday, April 29, 2024

రాష్ట్రంలో మండిపోతున్న నిత్యావసరాల ధరలు

- Advertisement -
- Advertisement -

Essential goods

 

ఇష్టానుసారంగా పెంచేస్తున్న దుకాణాల యజమానులు
చింతపండు కిలో రూ. 250, ఆయిల్ ప్యాకెట్ ధర రూ. 130లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ వస్తువు ధర చూసినా పది నుంచి ఇరవై రూపాయలకు అధికంగా పలు దుకాణాల యజమానులు అమ్ముతున్నారు. లాక్ డౌన్‌కు ముందు, ప్రస్తుత లాక్‌డౌన్‌లో త నిత్యావసర సరుకుల అమ్మకాల్లో తేడా కనిపిస్తోంది. కొందరు కృత్రిమ కొరత సృష్టించి మరి రేట్లు పెంచేస్తున్నారు. నిన్నమొన్నటివరకు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటే…. ఇప్పుడు నిత్యావసరాలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. ఎన్నాళ్లు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక చాలామంది రెండు మూడు నెలలకు సరిపడా రేషన్ కొని నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా డిమాండ్ పెరగడం.. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు మండుతున్నాయి.

దీంతో వినయోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. చిల్లర దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకు.. వ్యాపారులు చింతపండు రూ. 250, ఆయిల్ రూ.130లకు విక్రయిస్తున్నారు. ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. దీంతో సామాన్యులు సరుకులు కొనాలంటనే భయపడిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశలో చర్యలు లేకపోవడంతో వినియోగదారుడు నిలువుదోపిడీకి గురవుతున్నారు. లాక్‌డౌన్ ప్రకటన తర్వాత.. మూడు నాలుగు రోజుల నుంచే ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

పెరుగుతున్న ధరలను ఒక సారి చూస్తే…
సూపర్ మార్కెట్లలో ఎంఆర్‌పి కంటే రూ. 10 నుంచి – రూ. 30 తక్కువకే నూనె ప్యాకెట్లు లభిస్తాయి. ఉదాహారణకు ఆయిల్ ప్యాకెట్ ఎంఆర్‌పి రూ.130గా ఉంటే… వినియోగదారులకు అది రూ. 100- రూ.115కు దక్కేది. ఇప్పుడు ఆ రాయితీని తొలగించేసి రూ. 130కి విక్రయిస్తున్నారు. అలాగే ఇడ్లీ, బొంబయ్ రవ్వ, పప్పులు, పల్లీలు, చక్కెర, చింతపండు వంటి సరుకులపై ధరల స్టిక్కర్లను మార్చేసి విక్రయాలను కొసాగిస్తున్నారు.

కాగా లాక్‌డౌన్‌కు కిలో చింతపండు రూ. 150 ఉంటే… ఇప్పుడు రూ.200 నుంచి -రూ.250వరకు అమ్ముతున్నారు. కిలో రూ. 30 ఉన్న గోధుమ పిండీ… ఇప్పుడు రూ. 45కు చేరింది. కిలో రూ.70 ఉన్న కందిపప్పు, రూ. 90 నుంచి రూ.110కు చేరింది. కంది పప్పు కిలో రూ.110, పెసర పప్పు రూ.145, మినపపప్పు రూ.150కి అమ్ముతున్నారు. మిర్చి పౌడర్‌కు ప్రజల నుంచి డిమాండ్ బాగా ఉంది.

దీంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మిర్చి పౌడర్ కిలో రూ.350 ఉంచి -రూ.400 మధ్య విక్రయిస్తున్నారు. ఇలా ఏ వస్తువు చూసినా లాక్ డౌన్‌కు ముందు ఉన్న ధర కన్నా అధికంగా రూ. 10 నుంచి 20కు పెంచుతూ విక్రయిస్తున్నారు. ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

 

Shoppers who raise the prices of Essential goods
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News