Friday, April 26, 2024

యోగి పాలనలో ఇక తెల్లార్లూ మద్యం అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

Yogi

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో బార్లు ఇక తెల్లవారుజామున 2 గంటల వరకు తెరుచుకుని ఉంటాయి. అదే స్టార్ హోటళ్లలోని బార్లు తెల్లవారుజాము 4 గంటల వరకు తెరచి ఉంటాయి. ఈ కొత్త ఎక్సయిజ్ విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం బార్ల మూసివేత సమయాన్ని ఒక గంట పాటు పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే కొత్త ఎక్సయిజ్ విధానం ప్రకారం మద్యం షాపులు బార్‌కోడ్ సిస్టమ్‌ను కచ్ఛితంగా ఏర్పాటు చేసుకోవడంతోపాటు తమ వద్ద ఉన్న మద్యం స్టాకుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచవలసి ఉంటుంది.

Bars in UP to Remain Open Till 2AM, Bars maintained in starred hotels will remain open till 4am from April 1, 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News