Friday, April 26, 2024

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
భారీగా హాజరైన ఎన్‌ఆర్‌ఐలు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలు భారీగా హాజరు కాగా, దీనికి ముఖ్య అతిథిగా ఖతార్‌లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ ఆయన భార్య అల్పన మిట్టల్‌లు హాజరయ్యారు. ఐసిబిఎఫ్ అధ్యక్షుడు వినోద్ నాయర్, ఐసిసి ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణకుమార్, ఐసిసి అడ్వైయిజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసిబిఎఫ్ ఎంసి రజినీ మూర్తి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట, పాటలతో అలరించారు. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా 1,500మందికి పైగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఖతార్ తెలంగాణ జాగృతి కార్యవర్గానికి వీడియో సందేశంలో అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News