కాదని కాలు బయటపెడితే
కరోనా కాటేస్తుంది
సందేశాత్మక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన
ఎంపి జోగినపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్మీడియా వేదికగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ కరోనామహమ్మారిని తరిమివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నెటిజన్లను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా తల్లిమాట వినకుండా బయటకువెళ్లిన కొడుకు కరోనావైరస్ను ఇంట్లో వ్యాపింపచేసి తల్లి మరణానికి కారణమైన సందేశాత్మకమైన వీడియోను సంతోష్కుమార్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోవైరల్ అయింది. అనేక మందిని ఆలోచింపచేస్తోంది. వీడియోను చూసిన అనంతరం తాము ఇంట్లో నుంచి ఎట్టిపరిస్థితుల్లో బయటకు వెళ్లమని హామీ ఇస్తూ అనేక మంది ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఉన్న ఫోటోలను, పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటూ ఇంట్లో ఉన్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే శుక్రవారం ఎంపి సంతోష్కుమార్ ట్విట్టర్లో తల్లి మాట వినకుండా అనే వీడియోను పోస్టు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనాను తరిమి కొట్టేందుకు దేశావ్యాప్తంగా ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు.
అయితే కొంతమంది లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, తల్లి మాటలు కూడా వినకుండా బయటకువెళ్లి కరోనా వైరస్ను తమకు తెలియకుండానే ఇంట్లోకి తీసుకు వస్తున్నారు. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. రోగనిరోధక శక్తి ఎంత ఉన్నా కరోనా కాటు వేస్తోందనే విషయాన్ని మర్చి పోవద్దు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంది నాకు ఏమికాదు అంటూ బయటకువెళ్లితే కరోనాను మోసుకువచ్చి ఇంట్లో విషాదం నింపడంతో పాటు చుట్టుపక్కలకు కరోనాను వ్యాపించినవారవుతారని ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎంపి సంతోష్కుమార్ హెచ్చరించారు. సంతోష్కుమార్ చేస్తున్న పోస్టులను నెటిజన్ల ప్రశంసిస్తున్నారు. సందేశాత్మకంగా ఉండటంతో ప్రజలను అమితంగా ఆట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనాను తరిమివేయాలని ఆయన కోరారు. ప్రజలంతా లాక్ డౌన్లో భాగస్వాములై కరోనాను తరిమివేయాలని ట్విట్టర్లో సంతోష్కుమార్ సూచించారు.
No matter how strong you feel your immunity system is.. Someone of your acquaintance’s is not capable of fighting the deadly #COVID2019.
If you step out, you are not only risking your life but making someone’s miserable.
Stay put India 🙏. #StayHome #StaySafe#LockdownTelangana pic.twitter.com/R80dcPnxci— Santosh Kumar J (@MPsantoshtrs) April 3, 2020