న్యూఢిల్లీ: దేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. బెంగాల్లో భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 6న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, అక్టోబర్ 3న కౌంటింగ్ జరపనున్నట్లు సీఈసీ పేర్కొంది. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా పండుగ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, వారి కోరిక మేరకు దసరా తర్వాతనే ఉప ఎన్ని నిర్వహిస్తామని ఈసీ స్పష్టం చేసింది.
Bengal and Odisha by Election Schedule Released