Monday, April 29, 2024

రసవత్తరంగా నాలుగో టెస్టు: రెండో ఇన్నింగ్స్ లో భారత్ 43/0

- Advertisement -
- Advertisement -

IND vs ENG 4th Test: India 43/0 at stumps on day 2

లండన్: ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కెఎల్ రాహుల్(22)లు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పోప్(81), చివర్లో భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ చెలరేగిన క్రిస్ వోక్స్(50)లు ఇంగ్లంగ్ జట్టుకు 99 పరుగుల అధిక్యాన్ని అందించారు. ఇక, భారత బౌలర్లలో ఉమేశ్‌కు మూడు, జడేజా, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

IND vs ENG 4th Test: India 43/0 at stumps on day 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News