- Advertisement -
మనతెలంగాణ/కొండాపూర్: శిల్పారామంలో వారంతపు సెలవు రోజు అయిన ఆదివారం సాయంత్రం ఆంఫీథీయేటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. బెంగళూర్ నుండి విచ్చేసిన కళాకారులు సురేష్ తన భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, కృతి, దేవి, కృతి, తోడయా మంగళం, భజన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కళా నృత్య నికేతన్ బిందు మాధవి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శనలో పంచమాతంగా ముఖ గణపతి, భజమానస, శ్యామల మీనాక్షి, భో శంభో, గరుడగమనా, జతిస్వరం, ఝేమ్ ఝేమ్ తనన, చక్కని తల్లికి, రామాయణ శబ్దం, అష్టలక్ష్మి, నమశ్శివాయతేయ్ మొదలైన అంశాలను శిఖర, కీర్తి, శాన్వి, అదితి, భావన, ధన్య మొదలైన కళాకారులు ఎనబై అయిదు మంది కళాకారులు నర్తించి మెప్పించారు.
- Advertisement -