Tuesday, April 30, 2024

బిఆర్ఎస్, బిజెపి కలిసే నాటకమాడుతున్నాయి: భట్టి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ మండలంలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లీంచేందుకు లీకేజీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపి కలిసి విద్యార్థుల జీవితాలతో నాటకమాడుతున్నాయన్నారు.

తెలంగాణలో సింగరేణి కార్మికుల స్థితిగతులు మారలేదని, బిజెపి తెచ్చిన గనులు,ఖనిజాల బిల్లుకు బిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు.కేంద్ర బిల్లుకు మద్దతు ఇచ్చారో లేదో బిఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన అన్నారు.

బిఆర్ఎస్ మద్దతు తోనే సింగరేణి ప్రైవేటికరణ జరుగుతుందని, బొగ్గు బ్లాకుల విషయంలో బిజెపి, బిఆర్ఎస్ నాటకమాడుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News