Wednesday, May 15, 2024

తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించిన భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఆయన ఖమ్మం వెళ్లి ఆదివారం తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భట్టి ఆహ్వానించారు. ఆయన మాత్రమే కాదు వారం నుంచి కాంగ్రెస్ నేతలు తుమ్మలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తుమ్మల ఇంటికి వెళ్లి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా వెళ్లడంతో తుమ్మల హస్తం గూటికి చేరే అవకాశాలకు బలపడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News