- Advertisement -
పాట్నా : బీహార్లో నవంబర్ 3 న జరగనున్న అసెంబ్లీ రెండోదశ ఎన్నికల్లో పోటీకి నిలిచిన 46 మంది బిజెపి అభ్యర్థుల జాబితాను బిజెపి ఆదివారం విడుదల చేసింది. 94 నియోజక వర్గాల నుంచి వీరు పోటీకి నిలిచారు. నితీష్కుమార్ నాయకత్వం లోని జనతాదళ్ (యు)తో కలసి బిజెపి పోటీ చేస్తోంది. ఈసారి రాష్ట్ర బిజెపి మాజీ ఉపాధ్యక్షురాలు రేణూదేవిని బెటియా నియోజక వర్గం నుంచి పోటీకి నిలబెట్టారు. బైకుంఠ్పూర్ నుంచి మిథిలేష్ తివారీ, దానాపూర్ నుంచి ఆషా సిన్హా, పోటీ చేస్తున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 28న , నవంబర్ 3, 7 తేదీల్లో పోలింగ్ మూడు దశలుగా జరుగుతుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడుతాయి.
Bihar assembly election 2020
- Advertisement -