Monday, April 29, 2024

బిజెపిలో టికెట్ల గందరగోళం…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిలో టికెట్ల గందరగోళం నెలకొంది. లిస్టులో పేర్లు ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. ఫస్ట్ లిస్టులో బెల్లంపల్లికి అమరరాజుల శ్రీదేవి పేరును ప్రకటించారు. ఇవాళ ఐదో లిస్టులో శ్రీదేవిని మారస్తున్నామని బిజెపి నేతలు వెల్లడించారు. శ్రీదేవికి బదులుగా కొయ్యాల ఏమాజీని పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ మళ్లీ ఏమాజీకి బదులుగా శ్రీదేవి పోటీ చేస్తారని మళ్లీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఐదో లిస్టులో అలంపూర్ టికెట్ మేరమ్మకు ఇస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మారెమ్మకు బదులు రాజగోపాల్ పోటీ చేస్తారని ప్రెస్ నోట్ విడుదల చేయడంతో గందరగోళం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News