Monday, April 29, 2024

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బిజెపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. బిజెపి పార్టీ కార్యాలయం వద్ద బాణా సంచా పేలుస్తూ, నృత్యాలు చేస్తూ కార్యకర్తల సంబురాలు చేసుకున్నారు.
వేములవాడ పూజారుల నుంచి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర  చార్మినార్ నుంచి ప్రారంభమై మదీన, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, మెజంజాహి మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ మీదుగా  మెహిదీపట్నంలో ముగియనుంది. పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో రాత్రి సంజయ్ బస చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News