Tuesday, May 14, 2024

బిజెపి అధికారంలోకి రావడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట: బిజెపి కార్యకర్త ప్రత్యర్థులకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్లి తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడమే లక్షంగా పని చేయాలని కర్ణాటక రాష్ట్ర మైసూర్ ఎమ్మెల్సీ తేజశ్విని గౌడ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ఎమ్మెల్యే ప్రభారీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి తేజశ్విని గౌడ హాజరై మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు సైనికుల పని చేస్తే తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వం అని చెప్పారు.

తెలంగాణలో అవినీతి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గదే దించడానికి ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి బిఆర్‌ఎస్ వైఫల్యాలను తెలియపర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుదర్శన్‌రెడ్డి, ఎగ్గని నర్సిములు, దేవరకద్ర బాలన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, అసెంబ్లీ కన్వీనర్ కురువ రమేష్ , వైస్ ఎంపీపీ సుమతి, ఫుల్ టైమర్స్ నాగరాజు, ప్రశాంత్, జిల్లా నాయకులు ఎర్ర వెంకటన్న, శ్రీకృష్ణ మహేష్ యాదవ్, నర్సింహయాదవ్ , బూత్ అధ్యక్షులు బూత్ కమిటీలు సభ్యులు, బిజెపి మండల కమిటీ సభ్యులు, బిజెపి మోర్చల అధ్యక్షలు, నాయకులు, శక్తికేంద్ర ఇంచార్జీలు , ప్రజాప్రతినిధులు, బిజెపి మండల జిల్లా నాయకులు , భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News