Monday, April 29, 2024

శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు బాంబు బెదిరింపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు సందేశం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం సరిగ్గా 7.55కు ఎయిర్‌పోర్టులోని మొయిన్‌టెనెన్స్ కస్టమర్ కేర్ నెంబర్‌కు ఓ గుర్తు తెలియని ఆగంతకుడు బాంబు బెదిరింపు మెసేజ్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. హైఅలర్ట్‌తో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అయితే, ఎవరూ కంగారుపడొద్దని, భయపడాల్సిన అవసరం లేదని సిబ్బంది ప్రయాణీకులకు సర్ది చెప్పారు. అయితే, ఆగంతకుడి నుంచి వచ్చిన మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాంబు బెదిరింపునకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News