- Advertisement -
ముంబై: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం ముంబై హైకోర్టు రియాకు బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ముంబై విడిచి వెళ్లొద్దని హైకోర్టు రియాను ఆదేశించింది. 10 రోజులకోసారి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని, పాస్ పోర్ట్ సమర్పంచాలని పేర్కొంది. కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని రియా ముంబై సెషన్స్ కోర్టు ఆశ్రయించింది. అయితే, కోర్టు బెయిల్ నిరాకరించడంతో రియా ముంబై హైకోర్టును ఆశ్రయించింది. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. రియా సోదరుడు షాబిక్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సుశాంత్ మృతి కేసు వ్యవహారంలో బాలీవుడ్ డ్రగ్స మాఫియా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా, షాబిక్ లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.
Bombay HC Grants Bail to Rhea in Drugs Case
- Advertisement -