Wednesday, May 15, 2024

బోయిన్‌పల్లి కేసులో బౌన్సర్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

తెరపైకి మ్యాన్ పవర్ సప్లయర్ సిద్థార్థ పేరు

Bouncers involved in Bowen pally kidnap case

మనతెలంగాణ/హైదరాబాద్:  బోయిన్‌పల్లి అపహరణ కేసులో విజయవాడకు చెందిన సిద్ధార్థ కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో బయట పడింది. సిద్ధార్థ మనుషుల తరలింపులో కీలక పాత్ర పోషించారని టాస్క్ ఫోర్స్ విచారణలో బయట పడింది. వ్యవహారం లో గోవా, విజయవాడ, గుంటూరు హైదరాబాద్ లో మరొక 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి వద్ద నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారాలు రాబట్టారు. విజయవాడకు చెందిన సిద్ధార్థ కు బౌన్సర్లుని సప్లై చేసే కంపెనీ ఉందని, విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి ప్రాంతాలకు భూమా కుటుంబసభ్యులు వెళ్ళినప్పుడు వారికి సెక్యూరిటీగా సిద్ధార్థ తన మనుషుల్ని పంపేవాడని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాదులో ఐటి దాడులు కొనసాగుతున్నాయని వెంటనే హైదరాబాద్‌కు రావాలని భార్గవ్ సిద్ధార్ధకు సమాచారం అందించడంతో విజయవాడ నుంచి15 మంది వరకు చేరుకుని అపహరణలో పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతున్న అధికారులకు సీన్ లో సిద్ధార్ధ ఉన్నట్లు తేలడంతో అతని కోసం వేట మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News