Tuesday, May 14, 2024

బాక్సింగ్ డే టెస్టు: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

Boxing Day Test: Team India lose third wicket

 

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 36 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు స్కోరు 61 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్ధసెంచరీ దిశగా దూసుకెళ్తున్న శుభమన్ గిల్ ను  (45) కమ్మిన్స్ ఔట్ చేశాడు.  శుభమన్ గిల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే రీతిలో పూజారా(17)  కూడా కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి75 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే, హనుమ విహారి(12) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆరంబించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News