Saturday, May 4, 2024

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

Broken landslides on Indrakeeladri

 

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై  కొండచరియలు ప్రమాదకరంగా మారాయి. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల క్రింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో అధికారులు శిథిలాలను వేగంగా తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కొండ చరియలు విరిగి పడడంతో దర్శనాలను నిలిపివేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో సిఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. కొండచరియలు విరిగిపడటంలో ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News