Sunday, April 28, 2024

మరో రెండు స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారి పి.వెంకట్రామిరెడ్డిని బరిలో దించుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు 13 లోక్‌సభ స్థానాలకు బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్,హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.

త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ తరపున మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుం చి ఆత్రం సక్కు, నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ కడియం కావ్య, నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ : పి.వెంకట్రామిరెడ్డిలు పోటీ చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News