Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్ పాపమే ప్రాజెక్టులకు శాపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించే వివాదంపై రాష్ట్ర నీటిపారుదల శా ఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.ఈ సందర్భంగా ఆయన అసెంబ్లిలో మాట్లాడుతూ.. ఎన్నికల రో జున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యాంపైకి పోలీసులను పంపిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. ష రతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. గత పాలకుల ని ర్లక్షం, ఎపి సిఎం జగన్‌తో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు న్న లోపాయికారి ఒప్పందాల మూలంగా తెలంగాణ రా ష్ట్రం కృష్ణాజలాలను కోల్పోయిందని, అందుకు బాధ్యుడై న కెసిఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతనే నల్గొండ సభకు వెళ్ళాలని మంత్రి ఉత్తమ్ డి మాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని, నీటి వాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజానాలను కాపాడడంలో బిఆర్‌ఎస్ విఫలమైందని విమర్శించారు. గత కొ న్ని రోజులుగా తెలంగాణ రైతాంగానికి, ప్రజానికానికి అపోహలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మా ట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణనది తెలంగాణలో నారాయణపేట జిల్లాలోని తంగిడిలో కృష్ణానది ప్రవేశిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత పదేళ్లుగా గత పా లకుల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అన్యాయం జరిగిందని వివరించారు. నదుల  విషయంలో గతంలో అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగలేదన్నారు. పొతిరెడ్డిపాడు సామర్ధాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ ఎపి ప్రభుత్వం జీవో 203 ఇచ్చి.. జగన్ ప్రభుత్వం పెంచిందని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో రోజుకు 3 టిఎంసిలను అక్రమంగా తరలించారని ఆయన అన్నారు. తెలంగాణకు గ్రావిటి ద్వారా రావాల్సిన నీరు అక్రమంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సైలెంట్ అప్రూవల్తో ఏపీ మార్చుకున్నదని ధ్వజమెత్తారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం మొదలైందన్నారు. కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కులు, మల్యాల దగ్గర 6,300 క్యూసెక్కుల కృష్ణాజలాలను వాడుకునేంటుకు సామర్ధాన్ని పెంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల కంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణానదీ జలాల్లో రెట్టింపు అన్యాయం జరిగిందని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో సాక్షాధారాలతో అసెంబ్లీకి వివరించారు.
50 శాతం ఎక్కువ నీటి ఏపి తరలించుకుపోయింది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకూ శ్రీశైలం రిజర్వాయర్‌కు 10,655 టిఎంసిలు వస్తే.. అందులో నుంచి ఎపి ప్రభుత్వం 727 టిఎంసిలు తీసుకుపోయిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 24 వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 8,993 టిఎంసిల నీరు వస్తే అందులో నుంచి ఏకంగా 1200 టిఎంసిల కృష్ణా జలాలను ఎపి ప్రభుత్వం తరలించుకుపోయిందన్నారు. అంటే గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 శాతం ఎక్కువ వాటర్ ఆంధ్రవాళ్లు తీసుకుపోయారన్నారు. తెలంగాణలో ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలయ్యాయని అన్నారు. కానీ గత పాలకులు కేంద్ర ప్రభుత్వం ముందు 225 టిఎంసిల నీటిని వాడుకుంటున్నట్లుగా నిరూపించలేకపోయారని, అందుచేతనే మన రాష్ట్ర వాటా కేవలం 299 టిఎంసిలకు తగ్గిపోయిందని, ఇది ముమ్మాటికీ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ చేతగాని తనమేనని ధ్మజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్టు సామర్ధం తొలుత 2 టిఎంసిలు అని జీవో ఇచ్చి ఆ తర్వాత ఒక్క టిఎంసికి పరిమితం చేస్తూ తగ్గించారని అన్నారు. అంతేగాక 27,560 కోట్లు ఖర్చుపెట్టి.. ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదన్నారు. మరి కృష్ణా నదీ జలాలపై నల్గొండలో సభలు పెట్టుకొని ఏమీ ప్రయోజనమని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలం..
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ‘ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపిందని, రోజుకు 3 టిఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదని, రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ అభ్యంతరం తెలిపారు.
కెసిఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు..
బచావత్ ట్రైబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కారు విఫలమైందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. భారాస పాలకులది అసమర్ధతో.. అవగాహనా లోపమో అర్ధంకాలేదన్నారు. ఎపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. దిల్లీ వెళ్లి 512:299 టిఎంసిలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపి ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల భారాస పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు.. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారని వీడియోలను సైతం అసెంబ్లీలో ప్రదర్శించారు.
కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ వెళ్లలేదు..
రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుందని, ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయిన తర్వాత కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసి పరోక్షంగా సహకరించారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కెసిఆర్ హాజరుకాలేదని, సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేదన్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఉత్తమ్ 2013లోనే ప్రాజెక్టు మొదలైనా ఇప్పటకి పనులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయం తీసుకోలేదని, నల్గొండలో సభ నిర్వహించే ముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుక తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News