- Advertisement -
హైదరాబాద్: లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బాధ్యత భవన నిర్మాణదారులు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. వలస భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రియల్ ఎస్టేట్ వృద్ధి ఫలాలు భవన నిర్మాణదారులకు అందాయని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలన్నారు. కార్మికుల సంక్షేమాన్ని అశ్రద్ధ చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదని కెటిఆర్ హెచ్చరించారు.
Builders support construction labour in Telangana
- Advertisement -