Wednesday, May 22, 2024

ఝార్ఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

రాంచి: ఝార్ఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి గిరిదిహ్ జిల్లాలోని డుమ్రీ రోడ్డు వద్ద ఓ బస్సు అదుపుతప్పి బరాకర్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతి చెందగా, మరో 24 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రాంచి నుంచి బస్సు గిరిదిహ్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News