Monday, April 29, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

Cabinet OK to pay three DAs

ఒకేసారి మూడు డిఎలు చెల్లించేందుకు కేబినెట్ ఓకే
నేడో రేపో ఉత్తర్వులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు కరవు భత్యం (డిఎ)ల చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తోన్న మూడు కరవు భత్యం (డిఎ)ల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10.14 శాతం డీఏకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పెంచిన డిఎ మొత్తాన్ని 2021 జులై నుంచి డిసెంబర్ వరకు జిపిఎఫ్‌లో కలపనున్నారు. అదే విధంగా 2022 జనవరి జీతంతో కలిపి పెంచిన డిఎ అందజేయనున్నారు. మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News