Sunday, April 28, 2024

10మందిపై నరమాంసం భక్షణ కేసు

- Advertisement -
- Advertisement -

Cannibalism case against 10 people in Tamilnadu

 

చెన్నై : తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో కలకలం రేపుతోంది. వారంతా నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10మందిపై కేసులు నమోదు చేశారు. తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో జరిగిన ఓ వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే దాంతో పాటు నరమాంస భక్షణకు పాల్పడ్డారో, లేదో కూడా పోలీసులకు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News