- Advertisement -
ఢిల్లీ: ఘజియాబాద్లో అతి వేగంగా వచ్చిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీనికి సంబందించిన వీడియో స్థానిక సిసి కెమెరాలో రికార్డు అయింది. విజేందర్ అనే వ్యక్తి గళ్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. అంతే వేగంగా కారు అక్కడి నుంచి మాయమైపోయింది. వెంటనే స్థానికులు స్పందించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు స్వల్పంగా గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డ్రైవర్ కారు అక్కడే వదిలేసి పారిపోయాడు.
- Advertisement -