Friday, April 26, 2024

తల్లీ కూతుర్ల పై దాడి కేసు: యువతి తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిన్న జరిగిన తల్లీ కూతుర్ల పై దాడి కేసులో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభా గాంధీలో చికిత్స పొందుతూ  మృతి చెందింది. ప్రేమించిన ప్రియురాలిపై కత్తితో దాడి చేసి అడ్డు వచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేసి అనంతరం అతని గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా..మంగళవారం ఉదయం 10.30 గం సమయంలో మియాపూర్‌లోని వైభవి ఇంటికి వచ్చిన సందీప్ తల్లీ కూతుర్లతో గొడవపడి ఇద్దరిపై కత్తితో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడు. గాయాలపాలైన తల్లీ కూతుర్లను చికిత్స నిమిత్తం హస్పిటల్‌కు తరలించారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని గాంధీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News