Saturday, April 27, 2024

మియాపూర్‌లో చెడ్డి గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

పాఠశాలలో దొంగలు పడి నగదు చోరీ చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఇద్దరు వ్యక్తులు ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో వచ్చిన దొంగలు మియాపూర్‌లోని వరల్‌డ వన్ స్కూల్ పాఠశాల కౌంటర్‌లో ఉన్న రూ.7.85లక్షల నగదును చోరీ చేశారు. ఈ దొంగతనం దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ఇద్దరు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని మొత్తం కప్పుకుని, చేతులకు గ్లౌజులు వేసుకుని చోరీ చేశారు. వరల్డ్ వన్ స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News