Wednesday, May 1, 2024

పౌరుల అసౌకర్యానికి కేంద్రానిదే బాధ్యత : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Central responsibility for inconvenience to citizens: Congress

 

చండీగఢ్: భారత్ బంద్ సందర్భంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ఉద్దేశంతో తెచ్చిన మూడు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మద్దతు తెలపాలని కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు సునీల్‌జక్కర్ కోరారు. మోడీ ప్రభుత్వం అమెరికా నమూనాను అసుసరించి కార్పొరేట్ల తరఫున లాబీయింగ్ చేస్తోందని జక్కర్ విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు అనుమతించమని ఆయన అన్నారు. అనుమానాస్పద మూడు చట్టాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించాలన్న తమ పార్టీ డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News