Monday, April 29, 2024

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. కేంద్ర హోంశాఖ సీరియస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు పుంగనూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యువగళం పాదయాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం కోరింది.

ఈ ఘటనలపై ఏపీ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీకి కేంద్ర హోంశాఖ లేఖ పంపినట్లు సమాచారం. ఈమేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ టీడీపీ చీఫ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భద్రతపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని ఆయన లేఖలో విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News