Sunday, May 12, 2024

కొనసాగుతున్న పోలీస్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌క్రైం: రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురువారంతో 8వ రోజుకు చేరుకుంది. ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ ప్రవీన్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. సందర్భంగా 616 మందిని పిలవగా వారిలో 562మంది అభ్యర్థులు హాజరై సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించారు. ఈకార్యక్రమంలో పరిపాలనాధికారి బి. శ్రీనివాస్, సూపరిండెంట్లు శంకర్, మక్సూద్ , హైమద్, గోవింద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News