Friday, April 26, 2024

బాబూ… చచ్చిన విషసర్పంతో సమానం: విజయసాయి రెడ్డి

- Advertisement -
- Advertisement -

Chandra babu is poison snake in AP

విశాఖపట్నం: సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూసి టిడిపి నేతలు పార్టీలోకి వస్తున్నారన్నారని ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. టిడిపి నుంచి భారీగా కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు. ఎంపి విజయసాయి రెడ్డి సమక్షంలో టిడిపి నేతలు చేరుతున్నారు. విశాఖపట్నంలోని 14, 15, 25 వార్డుల నుంచి 500 మంది టిడిపి నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. విశాఖ అభివృద్ధికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి ఉందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినప్పటి నుంచి తాను ఎవరికీ భయపడనని, తనని ఎవరూ భయపెట్టలేరని టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు గింజుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబూ చచ్చిన విషసర్పానివని, అందుకే ఎవరూ భయపెట్టడం లేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అరుదైన మానసిక వ్యాధితో సిబిఎన్ బాధపడుతున్నారని, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News