Thursday, May 16, 2024

సానుకూల వాతావరణంలో చిన్నారుల పెంపకం

- Advertisement -
- Advertisement -

బాలల సంరక్షణలో తండ్రి భాగస్వామిని చేయాలి
తల్లిపాలను తప్పనిసరిగా పట్టించాలి
ఎన్‌సిపిసిఆర్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే

Children grow up in positive environment

మనతెలంగాణ,హైదరాబాద్: ఇంట్లో సానుకూలమైన వాతావరణంలో చిన్నారుల పెంపకం వారి ఎదుగుదలలో అత్యంత కీలకమని జాతీయ బాలల హక్కుల సంరక్షణ మండలి సభ్యురాలు ప్రజ్ఞాపరాండే అన్నారు. ఆదివారం సక్షమ్, యునిసెఫ్, సుస్నేహ హెల్త్ ఫౌండేషన్, ఫెర్నాండేజ్ ఫౌండేషన్, సీఎల్‌ఎంసీ, ధాస్త్రి మదర్ మిల్క్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఆర్యజనని’ ప్రారంభోత్సవం వర్చువల్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే తల్లులు యోగ, ధ్యానం అలవర్చుకుంటే దాని ప్రభావం తర్వాతి రోజుల్లో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. తల్లిపాలను అందించడం, చిన్నారుల పెంపకం, శిశువుల పౌష్టికాహారం తదితర అంశాలపై గర్భిణులకు శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల శారీరక, మానసికాభివృద్ధి గురించిన అంశాలను ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్ మాసం’ కార్యక్రమం ద్వారా గర్భిణుల ఆరోగ్యం, వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం సంబంధిత అంశాలపై విస్తృతమైన అవగాహన ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల మౌలిక కల్పనపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్ దివ్యదేవరాజన్, రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి శితికంఠానంద, సక్షమ్ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుకుమార్, సేవాంకుర్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ అశ్విని కుమార్ తోపాటు కార్యక్రమ నిర్వాహకులు, వైద్యులు, వివిధ రంగాల ప్రతినిధులు,ఆరోగ్య భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News