Friday, May 10, 2024

కెసిఆర్ కుటుంబంలో విషాదం…

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబంలో విషాదం నెలకొంది. కెసిఆర్ మేనమామ గునిగంటి కమలాకర్ రావు(94) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవివిహార్‌లో చనిపోయారు. ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. కమలాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మేనమామతో సిఎం కెసిఆర్‌కు మంచి అనుబంధం ఉంది. బాల్యంలో ఎక్కువగా మేనమామ ఇంటికి వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. కమలాకర్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. టిఆర్ఎస్ నేతలు కమలాకర్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News