Sunday, April 28, 2024

మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

CM KCR Fires on Prime Minister Narendra Modi

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ… ”డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమతామని సిఎం చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదు. తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టింది. కాంగ్రెస్ నిష్ర్కయా పరత్వ రాజకీయాల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం, బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై ఉన్నది. కేంద్ర ప్రభుత్వ రంగ స్థంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకొని.. ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉంది పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించేే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రజల కోసం ఏదీ చేయకుండా అన్నీ చేసినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతున్నది. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి.. అబద్ధాలను విస్త‌ృతంగా ప్రచారం చేస్తున్నది. అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది” అని సిఎం పేర్కొన్నారు.

”దేశ ప్రజలను చైతన్య పరిచి బిజెపి, మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటిదాకా.. ప్రజలు,రైతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్కపని కూడా చేయలేదు. చెప్పుకోవడానికి వారికి ఒక్క విషయమూ లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్థాన్, కాశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు. ప్రజలను మత పరంగా విభజించే ప్రయత్నం చేస్తారు. మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. అంతే తప్పు దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్కపని చేయలేదు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్టు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిల పడతారు. ఏదో చేసినట్టు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొడతారు తప్ప… వాస్తవానికి ఏ పని చేయరు. గులకరాళ్ల డబ్బాను ఊపినట్టు వాళ్ల ప్రచారం ఉంటుంది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో దూర దృష్టితో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. వీటితో ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. కానీ  బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి.. పెట్టుబడులను ఉప సంహరించుకుని వాటిని ప్రైవేటు-కార్పోరేట్ కంపెనీలకు ధారత్తం చేస్తున్నది. వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో.. ప్రభుత్వ రంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. అరుణ్ శౌరీని దానికి మంత్రిని చేశారు. అని కెసిఆర్ తెలిపారు.

”తొలిసారిగా వాజ్ పేయి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉప సంహరించుకున్నది. తర్వాత వచ్చిన  మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని బిజెపి విధానాలను కొనసాగించింది. మోడీ ప్రభుత్వంలో 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంది. వాటిని ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నది. మోడీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ స్థంస్థను ప్రారంభించక పోగా.. ఉన్నవాటిని మూసివేసే ప్రయత్నం చేస్తున్నది. దేశానికి, ప్రజలకు, మరోవైపు అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేసి, ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వానికి నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ 65 వేల కిలో మీటర్ల నెట్ వర్స్ భారతీయ రైల్వేలకు ఉంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. ప్రతి రోజు కోట్లాది మందికి సేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో కూడా రైల్వేలు సేవలు అందించాయి. అలాంటి రైల్వేలను ప్రైవేటు పరం చేసే అవసరం ఏమొచ్చింది.? రైల్వే స్టేషన్ లో ఛాయి అమ్మిన అని చెప్పి మోడీ.. ఇప్పుడు రైల్వే స్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.” అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News