డెహ్రాడూన్: ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆమె ముక్కును కోసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బగేశ్వర్ జిల్లాలో జరిగింది. బాలిక తల్లిదండ్రులపై వాళ్లు దాడి చేసి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కల్ఫలిగైర్ ప్రాంతంలో ఓ గ్రామంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. బాలిక ప్రతిఘటించడంతో ఆమె ముక్కును కోశారు. అడ్డొచ్చిన బాలిక తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా బంగారు అభరణాలు, 20 వేల నగదును ఎత్తుకెళ్లారు. వెంటనే స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై 376, 354 ఐపిసి సెక్షన్లతో పాటు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి రాకేశ్ తీవారి తెలిపాడు.