Wednesday, May 1, 2024

బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేస్తాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

బోథ్: భారత రాష్ట్ర సమితి హయాంలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవగానే నెల రోజుల్లో బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేస్తానమి సిఎం హామీ ఇచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చి పదేళ్లు అయ్యింది. ఒక్క సైనిక్ పాఠశాలను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన ఆయన ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నారు కెసిఆర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News