Monday, April 29, 2024

హుస్నాబాద్‌ లో సిఎం కెసిఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇవాళ హుస్నాబాద్‌ లో   సిఎం కెసిఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు జడ్పీచైర్మన్‌ మారపల్లి సుధీర్‌ కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌లో మేనిఫెస్టో విడుదల చేసి మధ్యాహ్నం సిఎం కెసిఆర్‌ బహిరంగ సభకు హాజరు అవుతారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సిఎం కెసిఆర్‌ హుస్నాబాద్‌ నుంచే మొదలు పెడుతున్నారన్నారు. పేదల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని, మూడోసారి కెసిఆరే సిఎం అవుతారని సుధీర్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News