Friday, April 26, 2024

దసరాకు కొత్త సచివాలయం

- Advertisement -
- Advertisement -

CM KCR who took look at new secretariat and gave advice to officers

అన్ని జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
రాతి కట్టడంలో ప్రత్యేక డిజైన్లను అందంగా చెక్కాలి
మంగళవారం నాడు కొత్త సెక్రెటేరియేట్ నిర్మాణాన్ని కూలంకషంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చిన సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : సచివాలయ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణాలను పరిశీలించిన కెసిఆర్, పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు తగట్లు కార్యాచరణను నిర్దేశించుకోవాలని ఉన్నతాధికారులను, గుత్తేదారులను ఆయన ఆదేశించారు. నూతన సచివాలయ భవనం అత్యాధునిక వసతులతో అన్ని హంగులతో నిర్మిస్తున్నామని.. దేశంలోని అన్ని సచివాలయాలకు రోల్డ్ మాడల్‌గా తీర్చిదిద్దాలన్నారు.

సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమం త్రి ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు ఫిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యత గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను ఆయన కలియదిరిగారు. ఈ గదుల్లో వెంటిలేషన్ బాగా వస్తుందని కెసిఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లయ్ గురించి సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. ఫిల్లర్ల డిజైన్లకు సంబంధించి పలు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సిఎం అధికారులకు సూచనలు చేశారు. సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సిఎంఓ అధికారులు స్మితాసబర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, ప్రియాంక వర్గీస్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News